తాండూరు, మార్చి 29 : పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచాయి. శనివారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి శుక్రవారం తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రోడ్డు కందనెల్లి సమీపంలోని జీపీఆర్ గార్డెన్కు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.