బండ్లగూడ, ఏప్రిల్ 22 : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు అంతారం నరేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ హాజరవుతారన్నారు. ఉదయం 10గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీ నేత, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
నాయకులందరూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రాందాస్, కో ఆప్షన్ సభ్యులు మలాకీ రత్నం, జగదీశ్, యువజన సంఘం అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, సీనియర్ నాయకులు నవాబు ముంతాజ్, విష్ణువర్ధన్రెడ్డి, రాజు, రజాక్, గోపాల్, సాయిబాబాగౌడ్, వెంకటేశ్, నర్సింహగౌడ్, చందు, రాముడు యాదవ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.