విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీఎం కేసీఆర్ అన్నదాతలకు సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్ అందిస్తుంటే కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదన్నారు. .
రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు తెలియవని, అందుకే మూడు గంటల కరంట్ చాలని అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు రాజుల్లా దర్జాగా బతుకుతుంటే.. ప్రతిపక్షాలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరించారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ