నాగర్కర్నూల్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ను దించాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది.. సీఎం రేవంత్రెడ్డి సంస్కారహీనమైన భాష మా ట్లాడుతున్నరు.. తెలంగాణ తొలి సీఎంగా పనిచేసిన నన్ను పట్టుకొని నీగుడ్లు పీకి గోటీలాడుకుంట.. నీ పేగులు తీస్తా అంటున్నారు.. తెలంగాణకు మంచి చేసిన నన్ను పట్టుకొని ఇన్ని మా టలనొచ్చా.. ముస్లింలంతా ఆలోచించాలి.. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీనే గెలుస్తుంది, జీవితాం తం సెక్యులర్ పార్టీగా ఉండే బీఆర్ఎస్ను గెలిపించాలి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర శనివారం సాయంత్రం నాగర్కర్నూల్కు చేరుకున్నది.
ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద జరిగిన కా ర్నర్ మీటింగ్లో వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల్లోనే 230 మంది రైతులు చనిపోయారు. కరెంట్ లేదు, రైతుబంధు రాదు, ఐదెకరాలకు మించిన రైతులకు రైతుబంధు ఇవ్వమంటున్నరు.. మిగతా రైతులు ఏం పాపం చేశారు? రైతులకు సాయం చేయని ప్రభుత్వం ఎందుకు? మోదీ హయాంలో భా రత్ వికసించిందా? ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా? పాలమూరు ఎత్తిపోతలకు జా తీయ హోదా ఇచ్చారా? నవోదయ విద్యాలయాలు ఇచ్చారా? కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి నాకు బలం ఇవ్వాలి.’ అని అధినేత పిలుపునిచ్చారు. ఈరోజు చాలా గొప్పదినం. పార్టీ ఆవిర్భవించిన రోజు. 23 ఏండ్ల కిందట తెలంగాణ సాధించాలని పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని ఉక్కు సంకల్పం తో యుద్ధాన్ని ప్రారంభించిన రోజు..
మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, ఆ గౌరవం ఎప్పుడూ మహబూబ్నగర్కు ఉంటదన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి గద్వాలకు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తూ వరికోతలు, వరి మిషన్లు, ధాన్యపురాశులను చూసి తనకు ఆనందం కలిగిందన్నారు. నా పాలమూరు ఇంత బాగైందని సంతోషపడ్డానన్నారు. అడ్డగోలు హామీలిచ్చి, దుష్ప్రచారాలు చేసి కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిందన్నారు. ఎండింది ఎండగా.. తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెడితే 20రోజులై నా కొనే దిక్కు లేదన్నారు.
ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకమన్నారు. ఈ బాధ ఎందుకొచ్చిందో ఆలోచన చేయాలన్నారు. బోర్లు, నీళ్ల ట్యాంకర్లు, బిందెలు మోసే పరిస్థితి ఎందుకొచ్చిందన్నా రు. ఐదెకరాలకు రైతుబంధు ఇస్తామంటున్నారని, కనీసం 10-15ఎకరాల వరకైనా ఇవ్వాలి కదా? ప్రభుత్వ సహకారం లేకుండా వ్యవసాయం జరుగదన్నారు. నాలుగైదు నెలలకే ఎందుకింత దుర్మార్గమని ప్రశ్నించారు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ మెడలు వంచాలంటే మీ బలం కా వాలి.. ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. యువకులు బుద్ధితో ఆలోచించాలన్నారు. మోదీ నూరు నినాదాలు చెప్పారని.. బీజేపీ అక్కరకు రాని చుట్టమన్నారు. గుజరాత్ సీఎం కందనూలులో మీటింగ్ పెడితే 1,500 మంది కూడా రాలేదన్నారు.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టిన మోదీ, రాష్ర్టానికి ఒక్కటీ ఇయ్యలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో ప్రజలు బాగుపడుతరని, వట్టెం రిజర్వాయర్ ఆరాటపడి కట్టుకున్నం, జాతీయ హోదా ఇవ్వమన్నం, రూ.25వేల కోట్లు సాయమడిగితే నయా పైసా సాయం చేయలేదన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలి, లేకుంటే రూ.5వేల కోట్ల గ్రాంట్ ఇవ్వమన్నారని, తల తెగిపడినా మీటర్లు పెట్టనని చెప్పినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఎవరికి కర్రుకాల్చి వాత పెట్టాలో నిర్ణయించేది ప్రజలేనన్నారు. ధర్మాన్ని, బీఆర్ఎస్ను గెలిపించండి.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందన్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముస్లింలు ఒకసారి ఆలోచించాలన్నారు. దేశంలో మొదటిసారి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇమామ్లు, మౌజమ్లకు గౌరవవేతనం ఇచ్చామన్నారు. ము స్లిం పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీనే గెలుస్తుందన్నారు. ముస్లిం యువత, పెద్దలందరూ సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. పాలమూరు, కందనూలులో మనమే గెలుస్తున్నామని, ఎలాంటి అనుమానం లేదన్నారు.
ఇక్కడ చదువుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ గెలవాలన్నారు. ప్రవీణ్ అల్లాటప్ప అధికారి కాదని, మీరు బలమిస్తే ఈ సీఎం మెడలు వంచుతామన్నారు. గురుకుల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేలా చేసిన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. చదువుకున్న వాళ్లు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమన్నారు. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, ముఖ్య నేతలు పాల్గొన్నారు.