వికారాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లకు గడువు సమీపిస్తుండడంతో ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించేలా బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తు న్నది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమై గెలుపుపై దిశానిర్దేశం చేశారు.
అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో నిలప డంతో గెలుపు పక్కా అనే ధీమా వ్యక్తమవుతున్నది. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సన్నాహక సమావేశాలను నిర్వహించి బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నా లుగు నెలలైనా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని..ప్రజాసంక్షేమాన్ని గాలికివదిలేసిందని ఆరోపించారు.
అందువల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అంతేకాకుండా కష్టపడి ఎంపీలుగా గెలిపిస్తే.. స్వార్థం కోసం పార్టీలు మారి.. ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న రంజిత్రెడ్డి, విశ్వేశ్వ ర్రెడ్డిలను ఓడించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కసిగా పని చేయాలన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ స్పీడ్ పెం చారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పాటైన అనంతరం జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ.. మూడోసారి కూడా చేవెళ్లపై గులాబీ జెం డా ఎగురవేసేలా పక్కావ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను పూర్తిచేసి.. క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించింది. అంతేకాకుం డా కాసాని జ్ఞానేశ్వర్ వివిధ సంఘాలు, వార్డులు, మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తుండగా..అతడికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఊరూరా ప్రచారం చేస్తున్నారు.
వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ వంటి వాటిలోనూ ప్రచారం జోరందుకున్నది. మరోవైపు కాసాని ప్రచార రథాలు కూడా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అంతటా తి రుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నుంచి అనూ హ్య స్పందన లభిస్తున్నది. బీసీలే కాకుండా అన్ని వర్గాలు ప్రజలు, సంఘాల సభ్యులు కూడా మద్దతు తెలుపుతున్నారు.. బ్రహ్మరథం పడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్గా పనిచేసిన కాసాని.. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్లకు చెందిన నాయకులు పార్టీలకతీతంగా కాసానిని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్పై పట్టున్న మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోని వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం సెగ్మెంట్ల నాయకులను సమన్వయం చేసుకుంటూ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను పార్టీ అధిష్టానం నియమించింది. వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా రాష్ట్ర నాయకుడు పీ.కార్త్తిక్రెడ్డి, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జడ్పీ వైస్చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, పరిగి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ సీనియర్ నేత రాంచందర్రావు, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా నాగేందర్గౌడ్ వ్యవహరించనున్నారు.