సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 70,387 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు.
వీరితో పాటు చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ 81,660 ఓటర్ల మెజారిటీతో గెలుపొందగా, బహదూర్పుర ఎంఐఎం అభ్యర్థి 67,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా అత్యల్ప మెజారిటీతో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి 268 ఓట్లతో గెలుపొందగా, యాకుత్పుర ఎంఐఎం అభ్యర్థి 810 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2175 ఓటర్ల తేడాతో నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్ఖాన్పై గెలుపొందారు.