మొయినాబాద్, నవంబర్ 25 : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పోజిగూడ, చిలుకూరు, ఎన్కేపల్లి, అమ్డాపూర్, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్, హిమాయత్నగర్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు కు సాధ్యం కానీ హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. జంట నగర ప్రజలకు తాగు నీరందిస్తున్న జంట జలాశయాలైన హిమాయత్సాగర్, గండిపేట జలాశయాలను పరిరక్షిస్తూ చేవెళ్ల ప్రాంతాన్ని హెచ్ఎండీఏ విధానాల ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
చేవెళ్ల గడ్డ మీద ఎక్కడైనా ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తిఆయుధాలు సరఫరా చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలులో చిప్పకూడు తిన్నాడని అన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. పూటకో పార్టీలు మారే బీజేపీ అభ్యర్థిని ప్రజలు ఎవరూ నమ్మరని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చిలుకూరు సర్పంచ్ గునుగురి ్తస్వరూప, మాజీ జడ్పీటీసీ కోంపలి ్లఅనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, డైరెక్టర్లు రాజుగౌడ్, కుమ్మరి రాము, భిక్షపతిగౌడ్, మహేశ్యాదవ్, చిలుకూరు గ్రామ అధ్యక్షుడు రాంచందర్, హిమాయత్నగర్ సర్పంచ్ మంజుల, వైస్ ఎంపీపీ మమత, ఎన్కేపలి ్లఎంపీటీసీ రితీశ్రెడ్డి, కాశీంబౌలి సర్పంచ్ మహేందర్రెడ్డి, అమ్డాపూర్ సర్పంచ్ రవళి, వెంకటాపూర్ సర్పంచ్ మోజ్కుమార్, ఎంపీటీసీలు మల్లేశ్, అర్జున్, నాయకులు రవి, కృష్ణారెడ్డి, కృష్ణమాచారి, రాజు, వెంకటేశ్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, మళ్లీ బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు ధీమాగా చెబుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. చిలుకూరులో ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిదన్నారు. మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఇన్చార్జి రమేశ్ దేవా, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్యకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ మద్దతు తెలుపుతూ చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన వస్తున్నదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా జనరల్ సెక్రెటరీ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ నేత కత్తి గోపాలకృష్ణ, ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా లక్ష్మణ్ వెన్నెపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి, నవంబర్ 25 : బీఆర్ఎస్తోనే రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. మండలంలోని కొండకల్, కొండకల్తండాలలో ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని, మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, ఎంపీటీసీ సరిత , నాయకులు డి.వెంకట్రెడ్డి, రాజూనాయక్, గోపాల్, వాసుదేవ్ కన్నా, బాలకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, కాంత్రెడ్డి, నవీన్రెడ్డి, ప్రశాంత్, భూపాల్, శంకర్నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : దేవునిఎర్రవల్లి, రామన్నగూడ, కందవాడ, నారాయణ్దాస్గూడ, ఈర్లపల్లి, ఎన్కేపల్లి, చన్వెల్లి, కౌకుంట్ల, ఆలూర్ తదితర గ్రామాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, వనం లక్ష్మీకాంత్రెడ్డి, వనం మహేందర్రెడ్డి బాల్రాజ్, ఈర్లపల్లి ఉప సర్పంచ్ స్వర్ణలతాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోవద్దని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపుకోసం ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరిగి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కా౦వడి తిరుపతి రెడ్డి, ప్రభాకర్, శివశంకర్ రెడ్డి, గుత్తి మల్లేశ్, శ్రీనివాస్, జంగయ్య తదితదరులు పాల్గొన్నారు.
నందిగామ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ గెలుపే లక్ష్యంగా మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని
షాబాద్ : గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్గౌడ్, మాజీ సర్పంచ్ కల్వకోల్ వెంకట్యాదవ్, పార్టీ
కేశంపేట : మండలంలోని గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇంటింటి ప్రచారం చేపట్టారు. నాయకులు ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని వార్డు ల్లో బీఆర్ఎస్ ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. కారుగుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20వ వార్డులో కౌన్సిలర్ కొందూటి మహేశ్వరి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని, కాంగ్రెస్కు ఓటు వేస్తే రాష్ట్రం ఆగమైతదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లతాశ్రీ, కృష్ణవేణి, గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ పిన్నమోని గోపాల్, నాయకులు తది తరులు పాల్గొన్నారు.