షాబాద్, నవంబర్ 24: సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, నరెడ్లగూడ, పోలారం, పోతుగల్, లక్ష్మారావుగూడ, వెంకమ్మగూడ, మక్తగూడ, రేగడిదోస్వాడ, తిర్మలాపూర్, ఏట్ల ఎర్రవల్లి, తిమ్మారెడ్డిగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ… ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.
కాంగ్రెస్ చెబుతున్న ఆరు గ్యారంటీలు కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. చేవెళ్ల నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనకు మరోసారి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందినట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ల ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు పి.కేతన, మంగమ్మ, ఇస్మత్బేగం, అనిత, శకుంతల, రాములు, శ్రీనివాస్గౌడ్, శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు అరుణ, జముకమ్మ, సునీత, పార్వతమ్మ, ముదిరాజ్ సంఘం నాయకుడు కాసాని వెంకటేశ్ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పి. రమేశ్యాదవ్, కొత్తపల్లి వెంకట్రెడ్డి, హన్మంత్, శ్రీశైలంయాదవ్, విశ్వం, సింగప్పగూడెం నర్సింహులు, అవిలాశ్గౌడ్, బి.రవి, మల్లయ్య, పోచయ్య, కుమార్, అంజయ్య, కుమ్మరి శ్రీను, కృష్ణయ్య, ఆయూబ్, మునీర్, యాదగిరి, రాజుగౌడ్, దామోదర్రెడ్డి, భరత్, పాపిరెడ్డి, సంజీవ, యాదిరెడ్డి, రాజేందర్రెడ్డి, సంజీవరెడ్డి, సత్యనారాయణగౌడ్, దినేశ్, నారాయణరెడ్డి, పాండు, శ్రీశైలంగౌడ్, వెంకట్రెడ్డి, మహిళలు, యువకులు పాల్గొన్నారు.