వికారాబాద్, డిసెంబర్ 20 : వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో బుధవారం నుంచి నిర్వహించే అతిరుద్ర మహాయజ్ఞానికి జరుగుతున్న ఏర్పా ట్లను బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే ఆనంద్ పరిశీ లించారు. ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 27 వరకు పెద్ద ఎత్తున జరిగే ఈ యజ్ఞానికి భక్తులు తరలి రానున్నారు.
అతి రుద్ర మహాయజ్ఞం వివరాలను సుభాశ్ పంతులును అడిగి తెలుసు కున్నారు. యాగశాలను పూర్తిగా పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్ అనంత్రెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, సుభాన్రెడ్డి తదితరులు ఉన్నారు.