జనక్పూర్ : అయోధ్య రామాలయంలో కానుకల చోరీ జరిగిందన్న విషయం నేపాల్లోని జనక్పూర్ భక్తులను కలవర పెట్టింది. జనక్పూర్ను సీతాదేవి జన్మస్థలంగా, శ్రీరాముని అత్తవారి ఇల్లుగా భావిస్తారు. అక్కడి జానకీ ఆలయ మహంత్ రోషన్ దాస్ ఈ విషయమై మాట్లాడుతూ ఏ రామాలయంలో ఇలాంటి ఘటన జరిగినట్టు తాను వినలేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై అయోధ్య ఆలయ అధికారులను సంప్రదించినట్టు తెలిపారు.
జనక్పూర్ నుంచి 5-7 ఏడుగురు సభ్యుల బృందం శ్రావణ మాసంలో అయోధ్యకు వెళ్లి మద్దతు తెలిపి తిరిగి వస్తుందని ఆయన తెలిపారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగినప్పుడు జనక్పూర్ తరపున పలు విలువైన కానుకలను బహూకరించారు. చోరీ తర్వాత విరాళాల్లో పెరిగిన చిన్న నోట్లు చోరీ ఉదంతం తర్వాత రామాలయానికి వచ్చే విరాళాల్లో 10, 20 రూపాయల నోట్ల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. రామాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరి కాల్ రికార్డును దర్యాప్తు చేయాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. అక్కడ ఉద్యోగుల్లో 99.99 శాతం మందికి బీజేపీతో సంబంధాలున్నాయని తెలిపారు