ఇబ్రహీంపట్నం, మే 5 : బీఆర్ఎస్ గెలిస్తే పేద ప్రజల సమస్యలు తీరుతాయని, కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేస్తున్నారు.
ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాలతో గులాబీదళం ప్రతిక్షణం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ గెలిపించటం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మితే కరువుతో పాటు కష్టకాలం దాపురించిందని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా తులేకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. సమర్థ నాయకుడు కేసీఆర్ పాలనలో పదేండ్లు సుభిక్షంగా బ్రతికిన ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా కష్ట కాలంలో కూడా రైతుల నుంచి వడ్లను కొనడంతో పాటు ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనాన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, సహకార సంఘం చైర్మన్ మహేందర్రెడ్డి, ఎంపీటీసీ నాగటి నాగమణి, మాజీ సర్పంచ్లు యాదగిరి, బీరప్ప, నాయకులు నర్సింహ, యాదగిరి, రాజిరెడ్డి, సత్యం, రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశాన్ని బడాబాబుల చేతుల్లో పెట్టి సామాన్యుల నడ్డి విరుస్తారని తెలిపారు. బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపిస్తుందని వివరించారు. కార్యక్రమంలో యాదయ్యగౌడ్, రాములు, కాసాని రవిగౌడ్ తదితరులన్నారు.
తుర్కయంజాల్ : బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్కు ఓటు వేసి అత్యధిక మెజారీతో గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్లో బీఆర్ఎస్ నాయకులు మోహన్ గుప్తా ఆధ్వర్యంలో గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, వెంకటేశ్, శ్రీను, చంద్రశేఖర్, యాదగిరి గౌడ్, రాజు, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేశ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని తుర్కయంజాల్ మాజీ సర్పంచ్ దశరథ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను అత్యధిక మెజారీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్రెడ్డి, శ్రీశైలం, దాసు గౌడ్, బాబయ్య, దయానంద్, శ్రీనివాస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల : బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బహదూర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెన్నారెడ్డిగూడలో ఆయన కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి క్యామమల్లేశ్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బెల్లి గోపాల్, మావిల్ల వెంకటేశ్, లక్ష్మణ్ నాయక్, రామావత్ శంకర్, బెల్లి శ్రీశైలం, వంగల సందీప్, జొన్నలగడ్డ వెంకటేశ్, గ్యార జంగయ్య, నిట్టు రాజు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆదివారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేటలో నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రశ్నించే గొంతుక మల్లేశ్కు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోశిక నర్సింహ, చేగూరి కృష్ణ, వెంకటేశ్, బండారు బాలయ్య, మధు, సుదర్శన్, యాదయ్య, చేగూరి చంద్రశేఖర్, ఎండీ మతిన్, నరేశ్, రాము, శివరాం, అభిరామ్, నవీన్, భాను, ఉపేశ్, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, శనివారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ కుమార్తె ఆరోనీ కృష్ణకాంత్ కుత్బుల్లాపూర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ ముద్దం స్వరూపా వీరస్వామియాదవ్, బాబు తదితరులు పాల్గొన్నారు.