పెద్దఅంబర్పేట, మార్చి 24: పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సర్కిల్లో శనివారం జరుగనున్న ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తూ తాను చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర శనివారం పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సర్కిల్ వద్ద ముగియనున్నదని.. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ముగింపు సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్న ఈ సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
జనవరి 22న యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర
శుక్రవారం వరకు నియోజకవర్గంలో 62 రోజులపా టు కొనసాగి 775 కిలోమీటర్లకు చేరిందన్నారు. ఇంటింటికెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి తెలుసుకోవడంతోపాటు.. వారి సమస్యలను తెలుసుకుని వాటిలో చాలావరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో పరిష్కరించినట్లు వివరించారు. మరికొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. మధ్యాహ్నం 3 గం టలకు ప్రగతి నివేదన ముగింపు సభ జరుగనున్న దన్నారు. నియోజకవర్గం నుంచి దాదాపుగా 20 వేల మంది వరకు సభకు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చక్రవర్తిగౌడ్, వెంకట్రెడ్డి, వినయ్రెడ్డి, జీవన్రెడ్డి, వెంకటేశ్, దామోదర్, విజయేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నాగార్జున్రెడ్డి, పవన్, శివ, పరశురాం, కోటేశ్వర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సభ కోసం ఏర్పాట్లు
ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభ కోసం బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇప్పటికే పెద్దఅంబర్పేటలోని విజయవాడ జా తీయ రహదారిపై కేటీఆర్, బంటి ఫ్లెక్సీలు వెలిశా యి. భారీవేదికను సిద్ధం చేస్తున్నారు. సభకు మం త్రి కేటీఆర్తోపాటు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
కాగా సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. సభకు వచ్చేవారికి ఇబ్బందుల్లేకుండా వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులున్నారు.
భారీగా తరలిరావాలి..
నేడు జరుగనున్న ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు , రైతులు, రైతుబంధు సమితి అధ్యక్షులు అధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలి. శనివారం మధ్యాహ్నం జరుగనున్న ఈ సభకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. – వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం