బషీరాబాద్, అక్టోబర్ 17: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెటుకున్న నన్ను ఆశీర్వదించడంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచార శంఖారావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మనమంతా చాలా అదృష్టవంతులం మరో రెండు నెలల్లో కేసీఆర్ ప్రభు త్వం ఏర్పా టు కాబోతుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన తరువాత గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 అవుతుందన్నారు. సమావేశానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీరంతా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు ప్రతినెలా కేసీఆర్ రూ. 3వేలు ఇచ్చేందుకు సౌభాగ్యలక్ష్మి అనే పథకం తీసుకవస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ బీమా పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికీ రూ.ఐదులక్షల బీమా వర్తింప చేయనున్నట్లు తెలిపారు. రైతు బంధు సాయం కింద ఎకరాకు ఇచ్చే రూ. 10వేలను, 16వేలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల కథ బషీరా బాద్ మండల ప్రజలకు బాగా తెలుసు..పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది మన వాళ్లకు అక్కడా చుట్టాలు చాలా మంది ఉన్నారు. గ్యారెంటీలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. బషీరాబాద్ మండలాన్ని రూ.68.18కోట్లతో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. బషీరాబాద్కు జూనియర్ కాలేజీ, రూ. 10కోట్లతో 30 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుడు శ్రీశైల్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, రోహిత్రెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ మండల దీక్ష తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు 40 రోజులు సమయం ఉంది ఈ 40 రోజులు మండల దీక్షగా పని చేసి రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్ మాట్లాడుతూ తాండూరులో రేవంత్రెడ్డి నిలబడ్డా చిత్తుగా ఓడిస్తామన్నారు. బీఆర్ఎస్లో పదవులు పొంది కాంగ్రెస్లో చేరిన మనోహర్రెడ్డి పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరుణం పురుషోత్తంరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంతాబాయి. వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, నాయకులు శ్రీని వాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, మాణికర్రెడ్డి, రామునాయక్, సికిందర్ఖాన్, నర్సిరెడ్డి, అబ్దుల్ రజాక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పెద్దేముల్: ప్రతి పక్షాలు ఊహించని విధంగా తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని చూసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం గొట్లపల్లి గ్రామం లో పెద్దేముల్, కోట్పల్లి మండలాల ఎన్నికల శంఖారావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఏమి ఇయ్య లేదు, ఏమి చెయ్యలేదన్నారు. ఎన్నికలవేళ కొత్త బిచ్చగాళ్లు వస్తారని, వారికి తాం డూ రు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియదన్నారు. తాండూరుకు ఏమి అవసరమో రోహిత్ రెడ్డికి మాత్రమే తెలుసన్నారు. ఎప్పటికైనా ఇంటోడు ఇంటోడే-బైటోడు బైటోడేనన్నారు. పెద్దేముల్ మండల అభివృద్ధికి రూ.78 కోట్ల 54 లక్షల నిధులు తీసుకొచ్చానన్నారు. కోట్పల్లి ప్రాజెక్టుకు రూ.70 కోట్లు,నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు, పెద్దేముల్ స్థానిక పాఠశాలకు రూ. కోటీ 73 లక్షలు,దవాఖానకు రూ. కోటీ 50 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, రాష్ట్ర నాయకుడు శ్రీశైల్రెడ్డి, జిల్లా గ్రం థాలయ, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్లు రాజూగౌడ్, నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ డీవై నర్సింహులు,పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, గొట్లపల్లి సర్పంచ్ పద్మమ్మ, ఎంపీపీ అనురాధ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్చారి, మండల సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు జనార్ధన్రెడ్డి, ధన్సింగ్, నాయకులు జయరాం నాయక్, రాములు, రాజ్కుమార్, గోపాల్ రెడ్డి, కోట్పల్లి ఎంపీటీసీ మహేశ్గౌడ్, బందెప్ప, సర్పంచులు వీరప్ప, నర్సింహులు, పాషా, రమేశ్, రాములు, రుక్కిబాయి పాల్గొన్నారు.