ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 7 : అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్కు ప్రధాన ఎజెండా అని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ మహేందర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోరాడి సాధించిన ప్రత్యేక తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపటం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ నీరు, డ్రైనేజీలు, సీసీరోడ్లు, హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి గ్రామానికి చెత్తసేకరణ ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరించటంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉండటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను నమ్మవద్దని, వారు చెప్పే మాటలు నమ్మితే పదేండ్లు వెనుకబడిపోయినట్లేనని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలు కష్టపడి పని చేయాలి
ఆదిబట్ల : బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి కార్యకర్త కష్ట పడాల్సిన సమయం ఇప్పుడే అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు ప్రమిదా గార్డెన్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ప్రతి కార్యకర్త గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. కేవలం ఎన్నికల ముందు గ్రామాలకు వచ్చే నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి మారు పేరుగా మంచిరెడ్డి కిషన్రెడ్డి పేరు తెచ్చుకున్నారని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. 23 రోజులు కష్ట పడితే మరో ఐదు సంవత్సరాలు అధికారం మనదే అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, సహకార సంఘం జిల్లా వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్లు కళమ్మ, ఆకుల యాదగిరి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తున్న ప్రచారం జోరందుకుంది. ఉదయం 6గంటలకే నాయకులు ప్రచారం ప్రారంభించి ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీలోని 24వార్డుల్లో కౌన్సిలర్లు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ప్రచారం ఊపందుకుంది.
మంచిరెడ్డిని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడ గ్రామంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రానున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ప్రాంతం ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓటుతో మరింత అభివృద్ధి
పెద్దఅంబర్పేట : కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దఅంబర్పేటలోని సదాశివ హెవెన్స్ కాలనీలో పలు కాలనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలనీల్లో ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పించామని, మరింత అభివృద్ధి చేయాల్సి ఉన్నదని చెప్పారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. సౌమ్యులైన మంచిరెడ్డి కిషన్రెడ్డినే మరోసారి గెలిపించుకుంటామని ఆయా కాలనీల ప్రతినిధులు స్పష్టంచేశారు. భారీ మెజారిటీతో గెలిపించి, మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్కే మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు చెరుకూరి రేణుక, నాయకులు జగన్, వడ్డేపల్లి విజయేందర్రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్రావు, జనరల్ సెక్రటరీ భాస్కర్రెడ్డి, నాయకులు ఇటిక్యాల మహేందర్, ఎండీ సత్తార్, వెంకట్రెడ్డి, దేశారం బాలకృష్ణగౌడ్, పిల్లి నగేశ్, మమత తదితరులు పాల్గొన్నారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
తుర్కయాంజాల్ : ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపాలిటీ కౌన్సిలర్ బొక్క రవీందర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మన్నెగూడలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గుర్రం చంద్ర శేఖర్రెడ్డి, ఆనంద్రెడ్డి, బొక్క గౌతమ్రెడ్డి, బుచ్చయ్య, మల్లెల ఉపేందర్, కందాడి లక్ష్మారెడ్డి, కందాడి ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
జోరు పెంచిన కారు
యాచారం : ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచినది. అన్ని గ్రామాలల్లో వాడవాడనా గులాబీ శ్రేణుల ప్రచారం హోరెత్తుతున్నది. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఎన్నికల ప్రచారంను చేపట్టారు. నందివనపర్తిలో రాజు ఆధ్వర్యంలో విశ్వకర్మలు తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. గున్గల్లో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగోసారి పట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తున్నారు. మండలం నుంచి బీఆర్ఎస్కు భారీ మెజారిటీ అందించేందుకు కృషి చేస్తున్నారు.