వికారాబాద్, నవంబర్ 28, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దాదాపు రెండు నెలలపా టు జరిగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సా యంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే ని న్న, మొన్నటి వరకు ఊరూ, వాడల్లో మోగిన మై కులు మూగబోయాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు మద్యం దుకాణాలు, బార్లు కూడా మూతపడనున్నాయి.
సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తే తగు చర్య లు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి స్ప ష్టం చేశారు. డబ్బు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే ఉన్న 9 బృం దాల ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతో పాటు, మరో 9 బృందాల ను నియమించి పక్కా నిఘా పెంచారు. మరోవై పు ఈ నెల 30 వరకు జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిల్లాలో ఎక్కడైనా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లయితే సీ-విజిల్ యా ప్ లేదా డయల్ 100 ద్వారా సమాచారామివ్వాలని సూచించారు.
ఈ నెల 30న అ సెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. పోలింగ్కు సం బంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏ ర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం ఓటర్లు 9,60,376 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1133 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ని యోజకవర్గాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తుకు చర్యలు చేపట్టారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు రెండు నెలలపా టు ఊరూరా, ఇంటింటి ప్రచారం నిర్వహించా రు. ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి అనూ హ్య స్పందన వచ్చింది. వికారాబాద్ నియోజకవర్గ అభ్యర్థి మెతుకు ఆనంద్ ప్రచారంలో భాగం గా ఏ గ్రామానికి వెళ్లినా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి జైకొట్టారు. వికారాబాద్ అభ్యర్థి ఆనంద్కు మద్దతుగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అంతా తానై పక్కా గెలుపు వ్యూహంతో ముందుకెళ్లారు. ఆనంద్ కు మద్దతుగా ఆయన సతీమణి సబితాఆనంద్తోపాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి నియోజకవర్గంలో ఎక్కడా ప్రచారం నిర్వహించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ మద్దతు తెలిపా రు.
కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గి, మద్దూ రు, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ తదితర మండలాల్లో ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశాలతోపాటు ఊరూరా రోడ్షోలు, బైక్ ర్యాలీలతోపాటు ఇంటింటి ప్రచారాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి నిర్వహించారు. పరిగి ని యోజకవర్గం నుంచి రెండోసారి బరిలో ఉన్న కొ ప్పుల మహేశ్రెడ్డికి సంబంధిత నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ప్రచారంలో భాగంగా మండలాల కార్యకర్తల సమావేశాలు, గ్రామాల వారీగా రోడ్ షోలు ఇంటింటి ప్ర చారం కూడా మహేశ్రెడ్డి నిర్వహించారు.
నియోజకవర్గంలోని ఏ ఊరుకెళ్లినా మహేశ్రెడ్డికి సం బండ వర్ణాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహేశ్రెడ్డికి మద్దతుగా ప్రచారంలో సతీమణి ప్రతిమ, సోదరుడు అనిల్ రెడ్డితో పాటు పార్టీ నా యకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించా రు. తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన రోహిత్రెడ్డి వైపే అన్ని వర్గాల ప్రజలు నిలుస్తున్నారు. రోహిత్రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆర్తి, తల్లి ప్రమోదినీరెడ్డి తాండూరు పట్టణంతోపాటు బషీరాబాద్, తాం డూరు మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు.