పెద్దఅంబర్పేట, అక్టోబర్ 29: కాలనీల్లో ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీలో దాదాపు 11 కాలనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఇప్పటికే కాలనీల్లో ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా చేయాల్సింది ఉన్నదని, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
గద్దల లెక్క ఐదేండ్లకోసారి వచ్చే నాయకులను నమ్మి మోసపోవొద్దని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు రమావత్ పరశురాంనాయక్, కోటేశ్వర్రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, విజయ్భాస్కర్రెడ్డి, గోపాల్గౌడ్, దామోదర్, బ్రహ్మానందారెడ్డి, జంగయ్య, వివిధ కాలనీల ప్రతినిధులు రామ్మోహన్, భాస్కరాచారి, లక్ష్మణాచారి, శ్రీనివాస్రెడ్డి, గిరిగౌడ్, జంగయ్య, శ్రీనివాస్, శంకర్గుప్తా, వెంకట్రెడ్డి, విజయ్మోహన్రెడ్డి, కర్ణాకర్రెడ్డి, అశోక్, మానయ్య, ఉన్నితన్, పెద్దిరాజు, చంద్రశేఖర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కిషన్రెడ్డిని గెలిపించాలని పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ ఒకటో వార్డు కుంట్లూరు జయప్రకాశ్నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్లెం ప్రభాకర్రెడ్డి, ఈదమ్మల బలరాం ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హరిశంకర్ ముదిరాజ్, నాయకులు మాడుగుల వెంకటేశ్గౌడ్, పెద్దింటి శ్రీనివాస్రెడ్డి, జోర్క రాము, షేక్ జహంగీర్, గోదల వెంకట్రెడ్డి, ఎండీ రసూల్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
మంచాల : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మ్యానిఫె స్టో బడుగు బలహీన వర్గాలకు లభ్ధి చేకూర్చేలా ఉన్నదని.. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరో సారి ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలం లోయపల్లిలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ, ధూం ధాం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అంతకుముందు ధూం ధాంలో కళాకారులు ఆటాపాటలతో అలరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీ నర్మద, ప్రధాన కార్యదర్శి బహదూర్, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, నాయకులు యాదయ్య, జానయ్య గౌడ్, ప్రవీణ్ నాయక్, కృష్ణ, సదానందం, ధనంజయ్య గౌడ్, గణేశ్, రావుల శంకర్, మలేశ్, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల మండలం జాపాల, స్మత్పూర్, ఆరుట్ల, మంచా ల తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నౌసు హరిప్రసాద్, పుట్ట సత్యం, చంద్రకాంత్, సతీశ్, రాంరెడ్డి, వెంకటేశ్, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన హక్కుతోనే ఓట్లు అభ్యర్థిస్తున్నా.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోరారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ రాజ్ రంజిత్ కాలనీ, ఇంజాపూర్ సీఆర్పీఎఫ్ కాలనీలో వివిధ కాలనీల్లో సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడా రు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్ శ్రీలత, రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సంజీవరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఆనంద్రెడ్డి, రాగన్నగూడ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్, చిన్న య్య, రాజిరెడ్డి, గోపాల్రెడ్డి, శంకర్, ఉపేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొత్తకుర్మ కార్తిక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు యాదిరెడ్డి, మహి ళా విభాగం మున్సిపాలిటీ అధ్యక్షురాలు అశ్విని, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం మండల పరిధిలోని రాయపోల్, దండుమైలారం, ముకునూరు, పోల్కంపల్లి, నాగన్పల్లి, కప్పాడు, తుర్కగూడ, పోచారం, ఉప్పరిగూడ, ఎలిమినేడు, తులేకలాన్ గ్రామా ల్లో బీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కృపేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షు డు రాంరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జంగయ్యముదిరాజ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యాచారం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా నాలుగోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లిలో ఆదివారం బూత్ స్థాయి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు కృష్ణయ్య, వార్డు సభ్యుడు లక్ష్మయ్య, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.