పెద్దఅంబర్పేట, అక్టోబర్ 22: కీలకమైన సమయంలో కార్యకర్తలు మరింత కష్టపడాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోరారు. ఆదివారం పెద్దఅంబర్పేటలోని తార కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి పాశం దామోదర్ అధ్యక్షతన పార్టీ బూత్స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల వేళ కార్యకర్తలు కష్టపడాలని, వారికి అన్నివేళలా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. పెద్దఅంబర్పేటను మున్సిపాలిటీగా చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోరాటాల గడ్డ అని, తాను ఎమ్మెల్యేగా గెలిచేనాటికి ఎన్నో పంచాదులు, కొట్లాటలు జరిగేవని గుర్తుచేశారు. కానీ, తాను ఐదారేండ్లలో వాటన్నింటిని కంట్రోల్ చేశానని, ప్రశాంత వాతావరణం సృష్టించానని పేర్కొన్నారు. ఆపై ప్రగతిని పరుగులు పెట్టించానని తెలిపారు. రూ.2,931 కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. వేల మందికి ఉపాధి కల్పించేలా భారీ కంపెనీలను ఇక్కడకు తీసుకొచ్చానని చెప్పారు.
రాత్రిపూట దొంగతనాలు కాదు, పగటి పూటే మాయమాటలతో మభ్యపెట్టే దుర్మార్గులు వస్తున్నారని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. వారి మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. ఇల్లు కట్టినా, వెంచర్ చేసినా, మరే నిర్మాణం జరిగినా వాలిపోయి, పర్సంటేజీలు వసూలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొన్ని సమయాల్లో ఒత్తిడితో ఎవరి మనసైనా నొప్పిస్తే క్షమించాలని అన్నారు. ఎన్నికల వేళ వెంట నడిచిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పనిచేసే వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కా రాంరెడ్డి, కళ్లెం ప్రభాకర్రెడ్డి, ఈదమ్మల బలరాం, అనంతుల వెంకటేశ్వర్రెడ్డి, కంచర్ల సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు హరిశంకర్, పరశురాంనాయక్, కోటేశ్వర్రావు, నాయకులు విజయ్భాస్కర్రెడ్డి, జోర్క రాము, సత్తార్, గౌని భాస్కర్, గోవర్ధనం ప్రవీణ్కుమార్, ఇబ్రహీం, గోపాల్గౌడ్, సుమన్రెడ్డి, విజయేందర్రెడ్డి, పాశం పవన్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల : బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీలకు గుబులు మొదలైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. ఆదివారం బోడకొండ, లింగంపల్లి, లోయపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపు కోసం బూత్ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించాలన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎంత ప్రచారం నిర్వహించినా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బహదూర్, పుల్లారెడ్డి, బద్రినాథ్గుప్తా, ప్రభాకర్, పల్నాటి బాల్రాజ్, మహేందర్, భిక్షపతి, చిందం జంగయ్య, రాంరెడ్డి, వీరేషం పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో నేడు ఎంతోమంది పేదలు సంతోషంగా ఉన్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గరాములు మాట్లాడుతూ…బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడ్తాల్ : మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్కి ఓటేస్తే మూడు గంటలు కరెంట్ కావడం ఖాయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిలన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జడ్పీటీసీ దశరథ్నాయక్, స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేశారని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందనుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్బ్లాంక్ అయ్యిందని తెలిపారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పాలకులు ప్రజలకు చేసిందేమీలేదని, వారు చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి ఓటు అడగాలని సూచించారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, నర్సింహ, సర్పంచ్లు రవీందర్రెడ్డి, హరిచంద్నాయక్, యాదయ్య, సులోచన, లోకేశ్నాయక్, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, ఎంపీటీసీలు లచ్చీరాంనాయక్, గోపాల్, ప్రియ, మంజుల, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, ఎల్లాగౌడ్, శ్రీనునాయక్, నాయకులు గంప శ్రీను, లాయక్అలీ, నరేందర్రెడ్డి, నర్సింహ, భిక్షపతి, గణేశ్గౌడ్, అశోక్, రామచంద్రయ్య, రంగయ్య, రాజు, సాయిలు, రమేశ్నాయక్, పంతూనాయక్, రాములు, సేవ్యానాయక్, పాండు, మహేశ్, ఇర్షాద్, అంజి, నరేశ్ పాల్గొన్నారు.