మొయినాబాద్, మార్చి 31 : తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా రూపాంతరం చెందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమంగళారం రెవెన్యూలోని వీరన్నవిఠల్ ఫంక్షన్హాల్లో మండల పరిధిలోని చిలుకూరు, చందానగర్, రెడ్డిపల్లి, అప్పోజిగూడ, మోత్కుపల్లి, చిన్నమంగళారం, కుతుబుద్దీన్గూడ, మేడిపల్లి ఎల్కగూడ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి. మహేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వీరన్నపేట గ్రామం నుంచి ఫంక్షన్ హాల్ వరకు ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలతో డప్పుల దరువు, పటాకుల కాల్చి, జైతెలంగాణ నినాదాల మధ్య భారీ ర్యాలీ గా తరలివచ్చారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విద్యా పరంగా చాలా వెనుకబడి ఉండేదని.. తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దేశ విదేశాల్లో పర్యటించి అధిక పెట్టుబడులు రాబట్టి ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్లకు నీళ్ల గోస ఇబ్బందులు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రవేశపెట్టిన భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా అయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన చెరువులను పునరుద్దరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో రాష్ట్రంలో కొత్తగా 2వేల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం మండలానికి ఇరువైపులా ఉన్న మూసీ నదిపై 6 వంతెనలు.. ఈసీపై 3 వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు మంజూరు అయ్యాయని, రోడ్డు విస్తరణలో భాగంగా చెట్ల తొలగింపులో కొందరు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. కానీ త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పారు. ఏప్రిల్ 20న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, 25న చేవెళ్ల నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ ఎం మమత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జె.స్వప్న, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూఫ్, డైరెక్టర్లు భిక్షపతిగౌడ్, రాము, మాజీ చైర్మన్ డప్పు రాజు, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు పి.జగన్మోహన్రెడ్డి, కావలి యాదయ్య, సర్పంచ్లు గునుగుర్తి స్వరూప, కె.రత్నం, సుకన్య, పద్మమ్మ, కుమార్, జి రాజు, ఎంపీటీసీలు మల్లేశ్, అంజయ్య, అర్జున్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, యువత అధ్యక్షుడు పరమేశ్, మైనార్టీ అధ్యక్షుడు ముజ్ను, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు ఆండ్రూ, హరిశంకర్గౌడ్, యేసు, విష్ణుగౌడ్, గోపాల్, రామచందర్, బాల్రాజ్, అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.