వికారాబాద్, ఏప్రిల్ 4: ‘ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రం లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ శ్రేణులు, కళాకారులు, మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. జై తెలంగాణ, జైజై కేసీఆర్ అన్న నినాదాలు మార్మోగాయి. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘ఆసరా’ పింఛన్లతో ఎంతో మంది బతుకులకు రాష్ట్ర సర్కార్ భరోసా కల్పిస్తున్నదన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఆర్థికంగా ఆదుకుంటూ సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలుస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని, రాబోవు రోజుల్లో మరింత ప్రగతి సాధించేలా కృషి చేస్తానన్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నవాబుపేట మండలం గులాబీమయమైంది.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ప్రభు త్వం కొనసాగుతున్నదని.. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం నవాబుపేట మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముం దు మండల కేంద్రం నుంచి ఫంక్షన్ హాల్ వరకు ఒగ్గు కళాకారులు డప్పులతో.. మహిళలు బోనాలతో భారీ ర్యాలీ తీశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజ రై ర్యాలీ తీస్తూ బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే పాల్గొని ఒగ్గు డోలు వాయిం చి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
అన్నదాతలు పంటల సాగుకోసం అప్పుల పాలు కావొద్దనే ఉద్దేశం తో ఎకరానికి రూ.పది వేల చొప్పున ఏడాదికి అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతు ఏ కారణంతోనైనా మృతి చెందితే ఆ కుటుం బం రోడ్డున పడకుండా ఉండేందుకు రైతుబీమా కింద రూ. ఐదు లక్షలు అందిస్తూ ఆదుకుంటున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ఆడపడుచులు తమ కుమార్తెల వివాహాలు చేసేందుకు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నారన్నారు. అంతేకాకుండా వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు ప్రతినెలా పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
ప్రభు త్వం విద్యావైద్యం రంగాలకు పెద్దపీట వేయడంతోపాటు మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చుతున్నదన్నా రు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని.. ఆయన తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమన్నారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రత్నం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నవాబుపేట మం డలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రాంతానికి ఏమి కావాలో వారికి తెలుసని, ఎలాంటి సమస్యలున్నా వారు పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సమ్మేళనం జయప్రదం..
ఈ ఆత్మీయ సమ్మేళనానికి 11 గ్రామాల (నవాబుపేట, యావపూర్, తిమ్మారెడ్డిపల్లి, వట్టిమీనపల్లి, దాతాపూర్, ఎతిరాజ్పల్లి, ఆర్కతల, మాదిరెడ్డిపల్లి, చిట్టిగిద్ద, చించల్పేట, పుల్మామిడి) నుంచి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ర్యాలీలో పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల డోలు, మహిళలు బోనాలు అలరించాయి. లంబాడీలు నృత్యం చేసి ఆకట్టుకున్నారు.