నవాబుపేట, నవంబర్ 11 : ముభారక్పూర్, గుబ్బడీఫత్యేపూర్ గ్రామాల మధ్యనున్న మూసి వాగుపై కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో రైతులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి 2017 సంవత్సరంలోనే పునాదులు పడినా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగింది. దీంతో ప్రభుత్వం మరో కాంట్రాక్టర్కు పనులను అప్పగించింది. బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50 కోట్లను మంజూరు చేసింది. కాగా, కాంట్రాక్టర్ నిర్మాణాపు పనులను నవంబర్ నెలలో ప్రారంభించగా, ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు తమ పొలాలకు రాకపోకలు సాగించేందుకు మరింత సులువుగా మారనున్నది. స్థానిక ప్రజాప్రతినిధులను ముభారక్పూర్ గ్రామస్తులు నిలదీయడంతో వారు చేసిన ప్రయాత్నాలకు ఫలితం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం మా గ్రామ సమస్యను పరిష్కరించడంలో చేసిన కృషి హర్షనీయమని ముభారక్పూర్, యెల్లకొండ, గుబ్బడీఫత్యేపూర్, అంతప్పగూడ, తల్లారం, దుద్దాగు గ్రామస్తులు, వాహనదారులు పేర్కొంటున్నారు.
పనులను పరిశీలిస్తున్న కాంట్రాక్టర్
పలు గ్రామాలకు మేలు..
ముభారక్పూర్, గుబ్బడీఫత్యేపూర్ గ్రామానికి మధ్యన ఉన్న మూసివాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎంతోగానో కృషిచేశా. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగనున్నది. పండించిన ప్రతి పంట కూడా మూసివాగుపై నుంచి వెళ్లే మార్గం తప్ప మరేదిలేదు. ఈ సౌకర్యానికి 4.50 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యావాదాలు.
– దయాకర్రెడ్డి, ఎంపీటీసీ
టీఆర్ఎస్తోనేగ్రామాభివృద్ధి
ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పూర్తయింది. మా ఊరి బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ. 4.50 కోట్లు వెచ్చించడం సంతోషకరం. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– చిట్టెపు బాలమణి, సర్పంచ్