School uniform | బొంరాస్పేట, ఏప్రిల్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా రెండు జతల యూనిఫాంను పంపిణీ చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి (జూన్ 12వ తేదీ) యూనిఫాంను విద్యార్థులకు అందించే విధంగా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యూనిఫాం కుట్టడానికి అవసరమైన వస్ర్తాన్ని జిల్లాలోని ఎంఆర్సీ, కార్యాలయాలకు చేరవేశారు. యూనిఫాంను కుట్టే బాధ్యత ను గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎంపిక చేసిన మహిళా సంఘాలకు అప్ప గించింది. కానీ సమయానికి విద్యార్థులకు యూనిఫాం అందకపోవడంతో ఈసారి స్థాని కంగా ఉన్న దర్జీలకే అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పాఠశాల విద్యా కమిటీల తీర్మానాల ఆధారంగా యూనిఫాం ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఎంఆర్సీ కార్యాలయాలకు చేరిన యూనిఫాం వస్ర్తాన్ని పాఠశాల యాజమాన్య కమిటీలు తీర్మానం చేసి దర్జీలకు అప్పగిస్తున్నాయి.
యూనిఫాం కలర్ మార్పు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాంను ప్రభుత్వం మార్పు చేసి అందించనుంది. బాలురకు రెడ్ మరియు యాష్ కలర్ చెక్స్లో షర్టు, నిక్కర్ మెరూన్ కలర్ నిక్కర్ ఉండేవిధంగా నిర్ణయించారు. బాలికలకు కూడా రెడ్ మరియు యాష్ కలర్ చెక్స్లో షర్టులు, మెరూన్ కలర్లో షూటింగ్స్ కుట్టే విధంగా నిర్ణయించారు. గత ఏడాది యూడైస్లో పొందుపర్చిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వస్ర్తాన్ని అంద జేశారు. వికారాబాద్ జిల్లాలో 97033 మంది విద్యార్థులకు 4,69,825 మీటర్ల వస్త్రం రావాల్సి ఉండగా 2,19,152 మీటర్ల వస్త్రం వచ్చింది. దీనిని జిల్లాలోని 19 మండలాల ఎంఆర్సి కార్యాలయాలకు పంపించారు.
జిల్లాలో 97033 మంది విద్యార్థులు
జిల్లాలోని 19 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, రెసి డెన్షియల్ పాఠశాలలు కలిపి మొత్తం 1099 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 97033 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 49518 మంది బాలికలు ఉండగా, 47515 మంది బాలురు ఉన్నారు. వీరికి రెండు జతల ఏకరూప దుస్తులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఒకటి నుంచి 3వ తరగతి చదివే బాలికలకు బాడీ ప్రాక్, షర్టు అందిస్తారు. 4,5 తరగతులు చదివే బాలికలకు స్కర్ట్, షర్టు అందజేస్తారు. 6 నుంచి 12వ తరగతి చదివే అమ్మాయిలకు పంజాబీ డ్రెస్సులు అంజేస్తారు. అదేవిధంగా 1 నుంచి 12వ తరగతి వరకు చదివే బాలురకు నిక్కర్, ప్యాంటు, షర్ట్లు అందిస్తారు. బాడీ ప్రాక్లు, షర్టులు, పంజాబీ డ్రెస్సులు, టాప్లు ఏవిధంగా కుట్టాలో సూచనలు ఇస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల యూనిఫాం ఒక జత కుట్టడానికి ప్రభుత్వం గతంలో మాదిరిగానే రూ.50లుగా నిర్ణయించింది.
స్కూల్స్ తెరిచేలోగా అందిస్తాం
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాం అంద జేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ప్రభుత్వం ముందుగానే జిల్లాకు యూనిఫాం వస్ర్తాన్ని సరఫరా చేసింది. దీనిని జిల్లాలోని అన్ని మండలాలకు తరలించాం. ఎస్ఎంసీ తీర్మానాల ఆధారంగా యూనిఫాం కుట్టడానికి టైలర్లకు ఇవ్వాలని సూచించాం.
– రేణకాదేవి, డీఈవో