వికారాబాద్, మార్చి 18 : లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలోని చంద్రకల్, కస్తూర్పల్లి, మైల్వార్, ఇందర్చేడ్, నవాంగి, కొత్లాపూర్, బొపునరం ప్రాంతాల్లో మొత్తం 7 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు, గిఫ్ట్లు, వెండి, బంగారు ఆభరణాలు ఉంటే కచ్చితంగా రసీదులు ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకు జిల్లావాసులు సహకరించాలని కోరారు.