ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా ఆదివారం గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బోనాల సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బోనాల పండుగను పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఊరపోచమ్మ, బంగారు మైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామాల్లో పండుగ వాతావరణం
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఆదివారం ముమ్మరంగా కొనసాగాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, చర్లపటేల్గూడ, కప్పాడు, ముకునూరు, ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడ గ్రామాల్లో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ముస్తాబైన ఆలయాలల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్కుమార్రెడ్డి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.