ఆమనగల్లు, ఆగస్టు 18: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ గురువారం ఆమనగల్లు పట్టణంలో అంబరాన్నంటింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ, పోచమ్మలకు మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం నుం చి పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది. స్థానికులు అమ్మవారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మాజీ ఎన్బీసీ సభ్యు డు ఆచారి, శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్ తదితరులు అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ రాంపాల్నాయక్, యాదవ సంఘం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.