బొంరాస్ పేట : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని అల్లికాన్పల్లి గ్రామానికి సమీపంలోని మరికుంట రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు వెళ్తుందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అన్నారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహంచుకోవడం శుభ పరిణామమని, గురువారం అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి కేసీఆర్ క్షేమాన్ని కోరుతూ పూజలు చేయాలని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, తాలుకా, మండల యూత్ అధ్యక్షులు నరేష్గౌడ్, మహేందర్, దుద్యాల-2 ఎంపీటీసీ ఎల్లప్ప, కోఆప్షన్ సభ్యుడు కాజా మైనుద్దీన్, పార్టీ నాయకులు మధుయాదవ్, బసిరెడ్డి, కవిత పాల్గొన్నారు.