సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో బుధవారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ప్రారంభించారు. స్వచ్ఛ పక్షంలో భాగంగా రక్తదానంపై అవగాహన కల్పించారు. పాస్పోర్ట్ ఉద్యోగులు రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 2022లో 6.59 లక్షల పాస్పోర్ట్లు జారీ చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. పాస్పోర్ట్ అధికారులు సులభతర ప్రక్రియలతో దరఖాస్తుదారులకు సేవలందించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందించారు.