ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఆదివారం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9.30 గంటలైనా సూర్యుడు కనబడలేదు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందారు.
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. పాదచారులకు ముందున్న మనుషులు కనబడలేని పరిస్థితి కనిపించింది. పిల్లలు, వృద్ధులు చలితో వణికిపోయారు. తగిన జాగ్రత్తలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
– న్యూస్ నెట్వర్క్