యాచారం, ఫిబ్రవరి 23 : రేవంత్రెడ్డి సెటిల్మెంట్ సీఎం అని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావు విమర్శించారు. బీజేపీ విజయ సంకల్పయాత్ర శుక్రవారం మాల్, యాచారం మండల కేంద్రాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మురళీధర్రావు మా ట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో పదవిలోకి వచ్చిన రేవంత్రెడ్డి మూడు నెలలు దాటినా వాటిని అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప రాష్ర్టానికి ఆయన ఒరుగబెట్టిందేమీలేదన్నారు. పక్కనే ఉన్న శివన్నగూడ ఎత్తిపోతల ను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
కొడంగల్ అభివృద్ధికి రూ.50కోట్లు ప్రక టించిన సీఎం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూడు నెలల వ్యవధిలోనే రేవంత్ అసమర్థ పాలన బయటపడిందన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం వస్తూ కరువును వెంట తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫార్మాసిటీ, మైనింగ్జోన్ తదితర ప్రాజెక్టులతో సీఎం రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నారని మండిపడ్డారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దెదించడమే బీజేపీ ప్రధాన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు భాష, ఎంపీపీ సుకన్య, మండలాధ్యక్షుడు రవీందర్, శ్రీధర్రెడ్డి, రాజు, అంజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 23 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నదని బీజేపీ శాసనసభా ఉపనాయకుడు కాటేపల్లి వెంకట్రాంరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పయాత్రకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ..ఎన్నికలకు ముందు ఆరుగ్యారెంటీల పేరుచెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, పార్టీ నాయకులు భాష, నర్సింహారెడ్డి, అర్జున్రెడ్డి, భాస్కర్, మనోహర్రెడ్డి, పాపారావు, వెంకట్రెడ్డి, ప్రతాప్, వీరేందర్గౌడ్, లచ్చిరెడ్డి, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, రాంరెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
షాద్నగర్, ఫిబ్రవరి 23: కాలం కలిసొచ్చి ఏదో గారెల బుట్టలో పడ్డాడు కానీ.. తన తెలివితేటలు.. రాజకీయ పరిజ్ఞానంతో రేవంత్రెడ్డి తెలంగాణ సీఎం కాలేదని మాజీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం షాద్నగర్ ఏబీ కాంప్లెక్స్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు, ప్రాజెక్టులు, ఆయకట్టు, నీళ్ల వాటా, నూతన ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రస్తుత సీఎంకు కనీస అవగాహన కూడా లేదన్నారు. ప్రాజెక్టులకు జాతీయn బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావు
బీజేపీ మహిళా నాయకు రాలు డీకే అరుణ హోదా అనేది పాత పద్ధతి అని.. బీజేపీ పాలనలో దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాన మోదీ పని చేస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు, హామీలను గాలికి వదిలేసిందని ఆమె మండిపడ్డారు. బీజేపీ నాయకులను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాబయ్య, నామోజీ, శ్రీవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.