శంషాబాద్ రూరల్ : తెలంగాణపై బీజేపీ అసలురంగు బయటపడిందని, పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాన మంత్రిగా కాకుండా బీజేపీ నాయకుడిగా నరేంద్రమోదీ మాట్లాడారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విమర్శించారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని తొండుపల్లి నుంచి శంషాబాద్ అంబేద్కర్ విగ్రహాం వరకు పార్టీ నాయకులు భైక్ ర్యాలి నిర్వహించారు.
అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సమయంలో విభజన హామీలను అమలు చేయకుండా గత ఏడు సంవత్సరాలుగా కాలయాపన చేస్తు తెలంగాణ రాష్ట్రా ప్రజలను అవమానించారని విమర్శించారు.
కార్యక్రమంలో పార్టీ సీనియర నాయకుడు గణేష్ గుప్త, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి,నీరటి రాజుముదిరాజ్ , మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్ ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్ రావు, మంచర్ల శ్రీనివాస్, రాచమల్ల సురేష్ , మేకల వెంకటేశ్ , జాంగీర్ ఖాన్ , పవన్ గౌడ్ , ప్రసాద్ ,శ్రీకాంత్ గౌడ్ , కొనమొల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ యాదగిరి,ప్రభాకర్ ,ప్రవీణ్ గౌడ్ లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.