తాండూరు, జూలై 7 : తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సంగీతాఠాకూర్ గురువారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు, టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు సహకారం అందించేందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ నయీం, కౌన్సిలర్ సింధుజ, టీఆర్ఎస్ నేతలు సంపత్కుమార్, నర్సింహులు ఉన్నారు.