బడంగ్పేట, మే2 : సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ కార్పొరేటర్ మమత మంగళవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి ఆమెకు గులాబీ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరిందన్నారు. మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లో ఏదో రకంగా ప్రభుత్వ పథకాలు తీసుకున్న వారు ఉన్నారని ఆమె తెలిపారు. కుల మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో, కులం పేరుతో మనుషులను వేరు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి ప్రజలు త్వరలోనే తగిన గుణ పాఠం చెప్తారని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు బీరప్ప, సిద్దాల లావణ్య బీరప్ప, బాలమణి, అనిల్ కుమార్, నందు, ధనలక్ష్మి రాజ్కుమార్, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, రవినాయక్, నర్సింహ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.