పరిగి/పెద్దేముల్/కొడంగల్/ధారూరు/తాండూరు/యాలాల, జనవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకుఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీకి వారు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.నారాయణ రెడ్డి, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, ఇందూరు ప్రకాశ్, డివై నర్సింహులు, యువ నాయకులు రఘు, దత్తాత్రేయ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ మున్సిపాలిటీ రెండోవార్డు కౌన్సిలర్ మధుసూధన్యాదవ్, హస్నాబాద్ సర్పంచ్ పకీరప్పలు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిని సన్మానించారు. అలాగే సీనియర్ నాయకుడు వడ్ల నందు ఎమ్మెల్సీకి హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తాండూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మహేందర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. యా లాల మండలం నుంచి హైదరాబాద్కు నేతలు తరలివెళ్లి మహేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, యాలాల మండల మాజీ ఎంపీపీ కరణం పురుశోత్తంరావుతో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.