తాండూరు : బతుకమ్మ, దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు తాండూరు నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో భక్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మను తయారు చేసి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి ఆటపాటలతో ఆనందంగా ఉత్సవాలు చేస్తున్నారు. పట్టణం, పల్లెల్లో ప్రతిష్టించిన అమ్మవార్లకు నిత్యం పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న స్థానిక నేతలు, కౌన్సిలర్లతో కలిసి తాండూరులో ప్రతిష్టించిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అందరూ కలిసిమెలసి పండుగలు జరుపుకోవాలని సూచించారు.