మర్పల్లి, జనవరి 20: రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పం టల పెట్టు బడికి ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు పథకం డబ్బులు, అలాగే రైతుబీమా డబ్బులు లోన్కు పట్టుకోవద్దని సూచించారు. ఏపీడీ, డీఆర్డీఏ బ్యాంక్ లింకేజీ స్కీంల పై చర్చించినట్లు తెలి పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏఈవో వెంకట్రామ్గౌడ్, ఎంపీడీవో మహేశ్ కుమార్, మర్ప ల్లి, మోమిన్పేట్, బంట్వారం మండలాల బ్యాంకు మేనేజర్లు ఏపీఎంలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు