కడ్తాల్, డిసెంబర్ 2 : మండల కేంద్రంలోని శివాలయంలో శుక్రవారం అయ్యప్పస్వామి మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు శ్రీశైలం, వెంకటేశ్, చంద్రయ్య, ప్రవీణ్ ఆధ్వర్యంలో, కడ్తాల్ గ్రామానికి చెందిన డాక్టర్ రమేశ్ అయ్యగారు నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జ్యోతి, పద్మ, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, నాయకులు వెంకటేశ్, మల్లికార్జున్, ఈశ్వరప్ప, సురేందర్రెడ్డి, పెంటారెడ్డి, మాలధారులు వీరయ్య, యాదయ్య, బాలరాజ్, శ్రీకాంత్, లక్ష్మణ్, నవీన్, మల్లేశ్, విజయ్గౌడ్, రాజు, లక్ష్మయ్య, మల్లేశ్, భక్తులు పాల్గొన్నారు.