షాబాద్ : జిల్లా స్థాయిలో షాబాద్కు చెందిన ఐదుమంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నట్లు పీఆర్టీయూ టీఏస్ షాబాద్ మండలశాఖ అధ్యక్షుడు కడ్మూరి సుదర్శణ్ తెలిపారు. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో షాబాద్ మండలానికి చెందిన సుశీల (సర్దార్నగర్), ప్రభాకర్రెడ్డి (షాబాద్), ధనలక్ష్మి (కుర్వగూడ), మల్లీశ్వరి (ముద్దెంగూడ), గణేశ్ (షాబాద్)లు మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ప్రభుత్వం అవార్డులు అందించడం సంతోషకరమన్నారు.