ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 17 : నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుండగా.. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్పల్లి, మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 100 మంది వరకు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరినవారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని.. లబ్ధిపొందిన ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో భారీ స్థాయిలో చేరుతుండడంతో.. ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరినవారికి తగిన గుర్తింపు లభిస్తుందని.. అందరూ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, పార్టీ మండల అధ్యక్షులు రాములు, రమేశ్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్రెడ్డి, బహదూర్, నాయకులు జంగయ్య, జగదీశ్వర్, గణేశ్, రవీందర్, బాలయ్య, ప్రేమ్, చందు, ఐలయ్య, ప్రభాకర్, మహేందర్, శ్రీరాములు, లింగం, జంగయ్య, వెంకటేశ్, బీఆర్ఎస్ శ్రేణులున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం సంఘీగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. పార్టీ కోసం పని చేసినవారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరినవారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు శాంతి, మాజీ వార్డు సభ్యులు జంగయ్య, నాయకులు మల్లేశ్, జంగయ్య, భిక్షపతి, శేఖర్, మహేశ్, రమేశ్, శేఖర్, పాండు, యాదయ్య,, అభి, శివానంద్, వంశీ, రాజు, రమేశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మేకగూడ పీఏసీఎస్ చైర్మన్ మంజులారెడ్డి, ఎంపీటీసీ రాజూనాయక్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహ, రైతు కో ఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ 4వ వార్డు కౌన్సిలర్ పుష్ప ఆదివారం 4, 5వ వార్డుల కౌన్సిలర్లు గోపాల్, లక్ష్మమ్మారాంరెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో హస్తం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పాలన సాగుతున్నదన్నారు. ఇంటింటికీ అందుతున్న పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నచ్చి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన 25 మంది కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్ రామకృష్ణారెడ్డి, తూర్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేవలం ఎన్నికల సమయంలోనే గ్రామాలకు వస్తారని, ఎమ్మెల్యేగా తాను ఐదేండ్లుగా ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని, వారందరికీ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లోనూ కొడంగల్లో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి
సీఎం కేసీఆర్ పాలనలోనే తమ ప్రాంతం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 150 మంది ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాలు, పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పరిగి మున్సిపల్ అభివృద్ధికి ఇటీవల మంత్రి కేటీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు బీఆర్ఎస్కు జై కొడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏ గ్రామానికెళ్లినా పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మౌలానా పాల్గొన్నారు.