మర్పల్లి, సెప్టెంబర్ 1: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాల ను అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రా మాలకు చెందిన 1,471 మంది ఆసరా లబ్ధిదారుల కు మంజురైనా పింఛన్ కార్డులు, ప్రొసీడింగ్ పత్రా లను వారు పంపిణీ చేసి మాట్లాడారు. పింఛన్ రాని వారు అధైర్యపడొద్దని.. అర్హులందరికీ వస్తాయని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందని ఇల్లు అంటూ లేదని స్పష్టం చేశారు.
ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వారు కొనియాడారు. వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిం చి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులను సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటితోపాటు కల్యాణలక్ష్మి, షాదీముభారక్, ఆసరా లాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. అనంతరం వారు మర్పల్లికి చెందిన సుధాకర్కు దళితబంధు కింద మంజూరైన కారును అందించడంతోపాటు పంచలింగాల్ గ్రామానికి చెందిన నర్సింహులు మంజూరైన ఎలక్ట్రికల్ షాపును వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దళితబంధు ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, ఎంపీపీ లలితారమేశ్, వైఎస్ ఎంపీపీ మోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్గౌడ్, ఎంపీడీవో జగన్నాథ్రెడ్డి, వెంకట్రామ్గౌడ్, ఎంపీటీసీ సంగీతా వసంత్, మర్పల్లి, మోమిన్పేటమండలాల సర్పంచు ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్, ఉపాధ్యక్షు డు అశోక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాచన్న, యూత్ అధ్యక్షుడు మధుకర్, రాచయ్య, రమేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులుపాల్గొన్నారు.