వికారాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చేపట్టి న చెరువుల పూడికతీత పనులు సక్సెస్ కావడం, చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో చేపల పెం పకానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు విడుతలుగా చేపల పెంపకం పూర్తి కాగా.. ఆ చేపలను విక్రయించి మత్స్యకారుల ఆర్థికంగా వృ ద్ధి చెందుతున్నారు. ఒక్కో చెరువులో రూ.లక్ష విలువైన చేపపిల్లలను వదలగా, వాటివిక్రయంతో రూ. ఒక్కో మత్స్యకార కుటుంబం రూ.3-5 లక్షల వర కు ఆదాయం పొందుతున్నది. తమ జీవితాల్లో నూతనోత్సాహం నింపిన సీఎం కేసీఆర్కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా జిల్లా లో 95 మత్స్యకార సొసైటీలుండగా.. వీటిలో మూడు మహిళా సంఘాలు(ఆలంపల్లి, పరిగి, రంగంపల్లి) ఉన్నాయి.
జిల్లాలో ఈ ఏడాది రూ.కోటీ26 లక్షల చేపపిల్లల ను పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఇందుకోసం జిల్లాలోని 733 చెరువుల్లో అవ సరమైన చేప పిల్లలను వదులనున్నారు. గత ఏడేండ్లుగా జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపలనుపెంచుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18. 75 లక్షల చేపపిల్లలు, 2017-18లో 53.41 లక్ష లు, 2018-19లో 25.99లక్షలు, 2019-20లో 197 చెరువుల్లో 41.54లక్షలు, 2020-21లో 555 చెరువుల్లో 98.64లక్షలు,2021-22లో 691 చెరువుల్లో 1.17కోట్ల చేపలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 692 చెరువుల్లో కోటీ18 లక్షల చేప పిల్లలను వదిలారు. జిల్లాలో మొదట కేవలం 70 చెరువుల్లోనే చేపల పెంపకాన్ని ప్రారంభించగా, తర్వాత ఏడాది నుం చి700లకుపైగా చెరువుల్లో చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తుండటంతో అవి పెరిగిన తర్వాత వాటిని విక్రయించి మత్స్యకారులు లాభాలు పొం దుతున్నారు. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్తోపా టు స్థానికంగా విక్రయిస్తున్నారు. రవాణా, పెట్టుబడి ఖర్చులు లేకపోవడంతో మత్స్యకారులు అధిక లాభాలను పొందుతున్నారు. అదేవిధంగా చేపల ను విక్రయించేందుకు మత్స్యకారులకు ప్రభుత్వం 70
శాతం సబ్సిడీతో వాహనాలను అందజేసింది. వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేపలను మ త్స్యకార సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు.
చేపల పెంపకంతో జిల్లాలోని మత్య్సకారులు ప్రతి ఏటా అధిక మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందజేసి స్వయం ఉపాధి కల్పించడంతో ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. చేపల పెంపకంతో ప్రతిఏటా జిల్లా నుంచి ఐదు వేల టన్నులకుపైగా చేపల దిగుబడి జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఏడేండ్లలో 692 చెరువుల్లో పెంచిన చేపలతో 31,508 టన్నుల దిగుబడి వచ్చినట్లు.. మత్స్యకార కుటుంబాలు రూ.402 కోట్లకుపైగా లాభాలను ఆర్జించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. చేప ల పెంపకం పథకం ప్రారంభించిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3 వేల టన్నుల దిగుబడి రా గా వాటి విక్రయంతో రూ.39 కోట్ల ఆదాయం, 2017-18లో 3500 టన్నుల దిగుబడికి రూ. 45.50 కోట్లు, 2018-19లో 4200 టన్నుల దిగుబడికి రూ.54.60కోట్లు, 2019-20లో 45 85 టన్నుల దిగుబడికి రూ.59.60కోట్లు, 2020-21లో 5184 టన్నుల దిగుబడికి రూ.67.39 కోట్లు, 2021-22లో 4920 టన్నుల దిగుబడికి రూ.67.39 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరం లో 6119 టన్నుల దిగుబడికి రూ.75.33 కోట్ల ఆదాయం వచ్చింది.