సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దాలనే చిరు ప్రయత్నం.. ఓ విప్లవాత్మక మార్పును తీసుకువచ్చిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల (గురుకులాల) విద్యార్థులు రచించిన పుస్తకాలను 35వ హైదరాబాద్ పుస్తక వేడుకలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద పిల్లల చదువు కోసం సీఎం కేసీఆర్ వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడంతోనే నాణ్యమైన విద్యను అందించడం సాధ్యమైందని అన్నారు. దీంతో పాటు రచయితలుగా ఎదిగేందుకు నిజామాబాద్ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు సంధ్యాదీప్తి కృషి ఫలిస్తున్నదని అభినందించారు. రచయితలు అంటే ఎకడినుంచో వస్తారనే అపోహ ఉంటుందని, కానీ విద్యార్థులను ప్రోత్సహిస్తే మనలోనుంచే కవులు, రచయితలు వస్తారని గురుకుల విద్యార్థులు నిరూపించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గురుకుల విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. విద్యార్థులే 17 పుస్తకాలు రాయడం ఒక విప్లవమేనని అన్నారు. తమ విద్యాసంస్థల నుంచి ఈ పుస్తకాలు రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని చెప్పారు. విద్యార్థులు రచయితలుగా మారడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజానికి మంచి సందేశాన్ని అందించేందుకు గురుకుల విద్యార్థులు చేస్తున్న ప్రయోగం బాగుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, భాషా సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి, శర్మ, నిజామాబాద్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు సంధ్యాదీప్తి, ఎన్.పద్మమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ రచించిన తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల సమగ్ర సమాచారం పుస్తకాన్ని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అవిషరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తెలంగాణ భౌగోళిక, చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. సమగ్ర సమాచారం పుస్తకాన్ని తప్పక చదవాలని సూచించారు. శ్రీమేధ పబ్లికేషన్ తెలంగాణ చరిత్ర, భౌగోళిక అంశాలను ఒక పుస్తకంలో తీసుకువచ్చినందుకు అభినందించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సమగ్ర చరిత్ర విద్యార్థులకు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త వేదకుమార్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర చదవడమంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చదవడమేనని అన్నారు. ఈ పుస్తకావిషరణలో టీఎస్పీఎస్సీ సభ్యులు ఆర్.సత్యనారాయణ, సుమిత్ర అనంద్ తనోభా, అవరెల్లి చంద్రశేఖర్, బండి లింగారెడ్డి, జూలూరు గౌరీశంకర్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంతర్జాతీయ బుక్ ఎగ్జిబిషన్ స్థాయికి ఎదిగిందని ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ బుక్ ట్రస్ట్లో తెలంగాణ సమగ్ర చరిత్రను ఇంగ్లిష్లోకి తీసుకువచ్చినందుకు పబ్లిషర్స్ను అభినందించారు. ఈ పుస్తకం గ్రూప్-1, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ బిట్ బ్యాంక్ గ్రూప్-4కు అభ్యర్థులకు హ్యాండ్ బుక్గా ఉంటుందని చెప్పారు. అనంతరం అలిశెట్టి ప్రభాకర్ వేదికపై బుర్రా వెంకటేశం రచించిన “గెలుపు పిలుపు” (సెల్ఫీ ఆఫ్ సక్సెస్)పుస్తకంపై బుర్రా వెంకటేశం ఐఏఎస్తో డాక్టర్ కొండ నాగేశ్వర్రావు, జూలూరు గౌరీశంకర్ ముఖాముఖి నిర్వహించారు.
మన ముఖ్యమంత్రి స్టాల్ను సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ స్టాల్లోని పుస్తకాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రిపై వచ్చిన పుస్తకాలు ఆత్మ బంధువు, ఎందరోచ్చినా.. వంటి జూలూరు గౌరీశంకర్ రచించిన పుస్తకాలను కొనుగోలు చేశారు. అనంతరం జాగృతి స్టాల్, గురుకులాల విద్యార్థులు రచించిన స్టాల్తోపాటు అనేక స్టాల్స్ను సందర్శించారు.
పుస్తకాల స్టాల్స్ను మంగళవారం సమాచార కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి సందర్శించారు. బుక్ ఫెయిర్కు విద్యార్థులు, పుస్తకాభిమానులు తండోపతండాలుగా వస్తున్నారంటే సంతోషంగా ఉందన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదిక కాకుండా అన్ని రకాలైన పుస్తకాలు చదవాలని చెప్పారు. సాంకేతిక విప్లవం ఎంత ప్రభావం చూపినా అచ్చు విలువ తగ్గలేదని అన్నారు.