కొందుర్గు , ఆగస్టు 21 : చిన్నారుల కు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు చదువు చెప్పేది అంగన్వాడీ కేంద్రాలు. కానీ, ఆ సెంటర్లకు ఉపాధ్యాయులు కరువయ్యారు. మండ లంలోని కొత్త ఆగిర్యాలలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ రెండిటిలోని టీచర్లు రిటైర్ కావడం తో విద్యార్థులు అవస్థలు పడుతు న్నారు. దీంతో ఉన్న ఆయమ్మనే రెండు అంగన్వాడీ సెంటర్లకు దిక్కయింది. ఆమేనే విద్యార్థులకు బోధి స్తున్నది. మరోవైపు ప్రతినెలా వెంకిర్యాల, చిన్నఎల్కిచర్లకు చెందిన అం గన్వాడీ టీచర్లు వచ్చి బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి వెళ్లిపోతున్నారు.
ఆయమ్మనే ఓ వైపు వంటావార్పు, మరోవైపు చిన్నారులకు చదువు చెబుతున్నది. రెండు సెంటర్లలో కలిపి 25 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు రిటైర్ అయి ఏండ్లు గడుస్తున్నా వారి స్థానంలో టీచర్లను నియమించాల్సిన ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అంగన్వాడీ టీచర్లు రిటైర్ కావడం తో వారి స్థానంలో ఏండ్లు గడుస్తు న్నా ఎవరూ రాలేదు. దీంతో నేనే చిన్నారులకు చదువు చెబుతున్నా. ఉపాధ్యాయులు లేకపోవడంతో అంగన్వాడీ సెంటర్లకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. చిన్నారులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రతిరో జూ నేనే చదువు చెబుతున్నా. అధికారులు స్పందించి కొత్త టీచర్ల ను నియమించాలి.
-కేతమ్మ, అంగన్వాడీ ఆయా