ఆమనగల్లు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం రెండోసారి పదవీ ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో ఆయన చేత ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణం చేయించారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహముద్ ఆలీ, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఈశ్వర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కవితా, దామోదర్రెడ్డి, ఎంఎంస్ ప్రభాకర్, మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు రాములు, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్యయాదవ్, అబ్రహం, ఆనంద్, చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్సీలు రవీందర్, గంగాదర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డిలు ఆయనకు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీకి అభినందనలు వెల్లువ…
ఎమ్మెల్సీగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డిని కల్వకుర్తి నియోజకవర్గంతో పాటుగా ఆమనగల్లు బ్లాక్ మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శాసన మండలికి తరలివచ్చి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో శాసన మండలి సభ్యుడిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లవేలలా ఉంటుందన్నారు.