ఆమనగల్లు : మండలంలోని గౌరారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
గౌరారం గ్రామంలో అదనపు గదుల నిర్మాణం కోసం రూ. 20లక్షలు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్టనారయణ, జోగు వీరయ్య, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అర్జున్రావు, డైరెక్టర్లు సుభాశ్, రమేశ్, వెంకటయ్య, వెంకట్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.