ఇబ్రహీంపట్నంరూరల్, మే 7 : రైతు తన పొలంలో అధిక దిగుబడి పొందాలన్నా..? రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నా.. ముందుగా భూసార పరీక్షలు చేయించాలి. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలన్నా ఏయే ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలన్నా పరీక్ష ఫలితాలకు అనుగుణంగా వాడితే రైతుకు పెట్టుబడి తగ్గడమే కాకుండా ఆశించిన దిగుబడులు వచ్చే అవకావముంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించేందుకు మట్టి నమూనా సేకరిస్తున్నారు. భూసార పరీక్ష వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. మరో నెలరోజుల్లో వానకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో భూసార పరీక్షలకు తరుణమిదేనని అధికారులు పేర్కొంటున్నారు. పంటలు సాగుచేసుకునే ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.
మట్టి నమూనా సేకరించే విధానం..
భూసార పరీక్షలతో లాభాలు..
భూసార పరీక్షలతో ఎన్నో లాభాలు
రైతులు తమ వ్యవసాయ పొలంలో భూసార తెలుసుకుని ఏయేపంటలు సాగుచేసుకునేందుకు అనుకూలంగా ఉందో తెలుసుకునేందు కోసం ప్రతిరైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. భూసార పరీక్షల ద్వారా వచ్చిన ఫలితాల ద్వారా ఏయే పంటలు వేసుకోవాలి, ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రతిరైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
– మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు
భూసార పరీక్షలు చేయించాలి
భూసార పరీక్షలకు మే పూర్తి అనుకూల సమయం. భూసార పరీక్షలు చేయించుకునే రైతులు తమ పొలాల్లో మట్టిని సేకరించి అందిస్తే ఇరవైరోజుల్లో వారికి ఫలితాలు అందజేయడంతో పాటు భూసార ఆరోగ్య కార్డు అందిస్తాం. భూసార పరీక్షలతో రైతులు తమ భూముల్లోని పోషక విలువలు తెలుసుకోవడం ద్వారా అసరమున్న ఎరువులను మాత్రమే వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రైతులు పండించిన పంటలకు అధిక దిగుబడు రావడానికి అవకాశం ఉన్నందున ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలి.
– శ్రవణ్కుమార్, ఏఈవో వ్యవసాయశాఖ ఇబ్రహీంపట్నం