పరిగి, ఫిబ్రవరి 16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అవలంభిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల వల్ల ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.జి.నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం పరిగిలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ సం దర్భంగా పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వ హించి, అనంతరం రాస్తారోకో జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం దేశంలో 80కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన మగ్గిపోతున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభు త్వం మళ్లీ రాయితీలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు, పెన్షన్ రూ.10వేలు అం దరికీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసి చట్టం చేయాలన్నారు. మధ్య తరగతి రైతులందరికీ కేం ద్రం ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. రోజు కూలీలకు రూ.800 కనీస కూలీ ఇవ్వాలని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అంగన్ వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, గిరిజన సంఘం జిల్లా నాయకులు వెంకటరాములు, ఆశా వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి మంగమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు ఎం.డి.హబీబ్, సత్యయ్య, రఘురామ్, కిష్టయ్య, నరేశ్, అలీ, శ్రీనివాస్, రాజేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 16 : రైతు వ్యవసాయ కార్మిక, కర్షక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో బీజేపీ అవలంబిస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గ్రామీణ భారత్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం నుంచి ఎమ్మార్పీ చౌరస్తా, మార్కెట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మహిపాల్తో పాటు బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి, రైతు సంఘం నాయకుడు అనంతయ్య మాట్లాడుతూ..నరేంద్ర మోదీ పదేండ్ల నుంచి దేశంలో రైతన్న, కార్మిక వర్గాన్ని వ్యవసాయ కూలీల పేదలపై ఎన్నడూ లేని రీతిలో నిత్యావసరాలధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చెప్పారు. కార్యక్రమంలో రైతులు, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ ఉద్యోగులు, 104, ఐకేపీ, గ్రామ పంచాయతీ, ఐద్వా మహిళా సంఘం, గిరిజన సంఘం, విద్యార్థి సంఘం, నాయకులు సత్యనారాయణ, నర్సింహులు, శ్రీనివాస్, అనసూయ, రేణుక, అనిత, అక్బర్, శ్రీనివాస్, భారతి తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 16 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్కు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్ధతు ప్రకటించింది. ఉపాధ్యా యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు గౌరారం గోపాల్ మాట్లాడుతూ మోడీ ప్రభు త్వం కార్మికులు, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
నాలుగు లేబర్ కోడ్ లను, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధరల చట్టాన్ని తేవాలని,ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని గోపాల్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్గౌడ్, పీఆర్టీయూ నాయకులు నరేందర్, అలీమొద్దీన్, రహీం, లక్ష్మయ్య, ఎమ్మార్సీ సిబ్బంది గౌస్, ఖలీల్, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.