ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 6 : యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణకు అన్నదాతలు చర్యలు తీసుకోవాలి. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయంలో ఎరువులతోపాటు పురుగుల మందులనూ వాడాల్సి ఉంటుంది. పంట సాగు చేసినప్పటి నుంచి పెరిగి.. ఆ తర్వాత కోత దశలోనూ పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. ఆ సమయంలో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకుని మందులు వాడితే మంచి ఫలితాలు, దిగుబడులొస్తాయి. కానీ, రైతులు ఎరువుల షాపుల నిర్వాహకులు, పక్క రైతుల స లహాలు తీసుకుని ఎరువులు, పురుగుల మందులు వాడుతున్నారు. దీంతో ఎన్నో అనర్థాలు చో టుచేసుకుంటున్నాయి. తెగుళ్లు ఒకటైతే మరొక్క పురుగు మందును వాడటంతో దిగుబడుల్లో తేడాలు వస్తుంటాయి. ప్రతి సీజన్లోనూ రైతులు ఇటువంటి పొరపాట్లు చేస్తూ పంట నష్టపోవడం చూస్తూనే ఉంటాం.
ఎలాంటి స్ప్రేయర్లు వాడాలి..
రైతులు తమ పంట పొలాల్లో క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు వివిధ రకాల స్ప్రేయర్లు వాడుతారు. అందులో పవర్, కంప్రెషర్స్ప్రేయర్లు ఉంటాయి. పవర్ స్ప్రేయర్ల వాడకంలో మందు వినియోగం ఎక్కువ నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. వీటి ద్వారా స్ప్రే చేస్తే పంటలోని ప్రతి భాగంపైనా మందుపడి పురుగులు, తెగుళ్లు తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. కంప్రెషర్ స్ప్రేయర్లతో పిచికారీ చేసినప్పుడు చిన్న, చిన్న తుంపర్లుగా మాత్రమే పంటపై పడుతుం ది. రైతులు ఎక్కువగా పవర్ స్ప్రేయర్లకే ప్రాధాన్యమిస్తే మంచిది. అకేలా స్ప్రేయర్లు, చేతి పంపులు, కంప్రెషర్ పంపులతో ప్రయోజనం తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
మందులు ఎక్కువగా అవసరమయ్యే పంటలు..
వాణిజ్య పంటలతోపాటు కూరగాయల పంటలకు ఎక్కువగా పురుగు మందులను వాడుతారు. వరి, పత్తి, మిరప, వేరుశనగ, కంది, పొగాకు, బెండ, కాలీప్లవర్, క్యాబేజీ తదితర పంటలకు క్రిమిసంహారక మందులు అవసరం ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూర పంటలపై మోతాదుకు మించి ఫెస్టిసైడ్స్ వాడితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందుల ప్రభావానికి గురైన వారిలో ప్రత్యుత్పత్తి, పెరుగుదలలో మార్పులు సంభవించడం, హైపర్ యాక్టివిటీ, శరీర భాగాల మధ్య సమన్వయ లోపం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారటం, వికారం, వాంతులు, విరేచనాలు స్పృహ కోల్పోవడం లాంటివి జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
మోతాదుకు మించి వాడితే పంటలకు నష్టం
క్రిమిసంహారక మందులను మోతాదుకు మించి వాడితే పంటకు నష్టం. అవసరమైనంత మేరకే వాడాలి. పురుగు మందులను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. వీటివల్ల భూమిలోని సారం తగ్గిపోయి భవిష్యత్తులో పంటలు పండే అవకాశం తగ్గుతుంది. మందు పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకు ఏ తెగులు సోకిందో నిర్ధారించుకున్న తర్వాతే వాడాలి. పురుగు మందును కలిపేటప్పుడూ కొలతను పాటించాలి.
– సత్యనారాయణ, ఏడీఏ వ్యవసాయశాఖ ఇబ్రహీంపట్నం
మందులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పిచికారీలో జాగ్రత్తలు..