ఇబ్రహీంపట్నం, జూన్ 24 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటలు బీటలు బారుతున్నాయి. కాంగ్రెస్కు గట్టి పట్టున్న పలు గ్రామల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లికి చెందిన అనేకమంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే కిషన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికలెప్పుడొచ్చినా రాష్ట్రంతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్లీ గులాబీ జెండా ఎగురటం ఖాయమన్నారు. నియోకజవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల మంచాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. అలాగే, ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పార్టీని నమ్ముకుని పార్టీకోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్సిస్తామన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, అయ్యప్పరెడ్డి, శ్రీనివాస్, ఈశ్వర్, అమరేందర్రెడ్డి, మోహన్రెడ్డి, మల్లారెడ్డి, ఐలయ్య, కరుణాకర్రెడ్డి, రవీందర్, సురేందర్రెడ్డి, నరేందర్రెడ్డి తదితరులున్నారు.