కడ్తాల్, మే 23: ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం కడ్తాల్, మాడ్గుల్ మండలాల పరిధిలోని వాసుదేవ్పూర్, గిరికొత్తపల్లి గ్రామాల్లో గల ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న, అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందని, పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు పనులను పూర్తి చేయాలని తెలిపారు.
పాఠశాలల్లో తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో సరస్వతీ, ఎంపీవో వేజన్న, డీఈ శ్రీనివాస్, ఏఈలు పరమేశ్వర్, సూర్యవంశీ, ఎంఈవో సర్దార్నాయక్, మండల నోడల్ అధికారి జంగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.