రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): కోర్టు ఉత్తర్వులను అమలుపరచడానికి లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు న్యాయవాది కటకం శారద తనకు సంబంధించిన ఆస్తి వివాదంపై కోర్టులో సివిల్ దావాను దాఖలు చేశారు.
రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు సీనియర్ సివిల్ న్యాయస్థానం ప్రాపర్టీని ఫిర్యాదుదారుకు స్వాధీనపర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నజారత్ సెక్షన్కు సంబంధించిన బెయిలిఫ్ కే రామకృష్ణ, డీ వెంకటేశ్వర్లు అమలుపరచడానికి లం చం డిమాండ్ చేశారు. దీంతో శారద ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రసాయనాలు పూసిన 11 వేల నగదును రామకృష్ణ సూచనలతో వెంకటేశ్వర్లుకు అందజేయగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.