అమీన్పూర్,ఆగస్టు 11 : షేర్ మార్కెట్లో లక్షల రుపాయాలు పెట్టి నష్టపోయిన సాప్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పీజేఆర్ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ( 37 )సాప్ట్వేర్ ఉద్యోగంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ ఇంట్లో ఉంటున్నాడు. కాగా తన వద్ద ఉన్న ఇరవై లక్షల రుపాయాలను స్టాక్ మర్కెట్లో పెట్టాడు.
దీంతో స్టాక్ మర్కెట్లో నష్టాలు రావడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్డరం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.